నిమ్మరసం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. చర్మం, దంత సమస్యలు దూరమవుతాయి. అయితే దీన్ని రోజూ మూడు పూటలా నీటిలో కలిపి తాగితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిమ్మరసం కలిపిన నీటిని మూడు పూటలా తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. ప్రధానంగా వేసవి కాలంలో ఎదురయ్యే డీ హైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.
2. వయస్సు మీద పడడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య లక్షణాలు దరి చేరవు. చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు, మొటిమలు పోతాయి.
3. జీర్ణ సంబంధ సమస్యలు నయమవుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి.
4. శరీరంలో ఉన్న విష పదార్థాలు పోతాయి. లివర్ శుభ్రమవుతుంది.
5. నోటి దుర్వాసన తగ్గుతుంది. చిగుళ్లు, దంత సమస్యలు మాయమవుతాయి. దంతాలు తెల్లగా, దృఢంగా మారుతాయి. దంతాలు, చిగుళ్ల నొప్పి తగ్గుతుంది.
6. బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. వాంతులు, వికారం వంటి లక్షణాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
7. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.
8. దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు పోతాయి.
9. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధికంగా ఉన్న బరువు తగ్గుతారు.
10. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి నిమ్మరసం మేలు చేస్తుంది. దీని వల్ల వారి రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
11. మూత్రాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.
